సొజ్జ భక్ష్యాలు
కావలిసిన వస్తువులు:
మైదా - 250 గ్రా
బొంబాయి రవ్వ - 250 గ్రా
పంచదార - 250 గ్రా
ఏలకులు - 10
నెయ్యి
తయారీ:
కావలిసిన వస్తువులు:
మైదా - 250 గ్రా
బొంబాయి రవ్వ - 250 గ్రా
పంచదార - 250 గ్రా
ఏలకులు - 10
నెయ్యి
తయారీ:
- మైదా పిండి జల్లించి ఒక చెంచా నెయ్యి వేసి సరిపడా నీళ్లు పోసి పూరీలా పిండిలా కలిపి మర్దన బాగా చెయ్యాలి.
- ఒక గిన్నిలో 600 ml నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి.
- రవ్వ ఉడికిన తరువాత పంచదార వేసి బాగా కలిపి రెండు చెంచాలు నెయ్యి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గిర పడిన తరువాత దించి చల్లారనివ్వాలి.
- మైదా పిండిని సుమారుగా 25 ఉండలు చేసుకొని వాటిని పూరిలాగా చేసి అందులో బొంబాయి రవ్వ పూర్ణాన్ని పెట్టి మల్లి ఈ పూరీని మూసి నెయ్యి చేతితో వత్త్తి పూరిలాగా చేసుకోవాలి.
- వీటిని పెనం మీద వేసి నేతితో దోరగా కాలనిచ్చి తీసుకోవాలి.
- ఇవి రెండు రోజులు నిల్వ ఉంటాయి.
No comments:
Post a Comment